Dharmaram | ధర్మారం, మార్చి10 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఏజెంట్ ఇప్ప మల్లేశం ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్ పరిధిలో అత్యధిక బీమా పాలసీలు చేసి టాపర్ గా నిలవడం ఎంతో అభినందనీయమని ఆ సంస్థ కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ పీ నాగశివప్రసాద్ అన్నారు. మల్లేశం కరీంనగర్ డివిజన్ పరిధిలో గత 10 సంవత్సరాలుగా అద్భుతమైన బీమా పాలసీలు చేస్తూ మొదటి స్థానంలో నిలుస్తూ క్లబ్ గేలెక్సీ, ఎండీ ఆర్టీ స్థానంలో నిలవడం హర్షనీయమన్నారు.
అత్యంత ప్రధానమైన ఈ రెండింటిలో మల్లేశం అవార్డు పొందిన నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించి స్వయంగా కరీంనగర్ నుంచి ధర్మారం మండల కేంద్రంలోని ఆయన ఇంటికి వచ్చి మల్లేశం ఆయన సతీమణి సరోజను డివిజనల్ మేనేజర్ శివనాగప్రసాద్ శాలువాతో సత్కరించి అభినందించారు.
ప్రత్యేక బహుమతిని ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ మేనేజర్ శివ నాగ ప్రసాద్ మాట్లాడుతూ మల్లేశం భవిష్యత్లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ రవి నాయక్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అచ్యుత్ రావు, ఎల్ఐసీ అసోసియేట్ మంచాల వరప్రసాద్ తో పాటు ఎల్ఐసీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.