“రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటునే నిరంతర కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా? మూడు గంటల కరెంటు చాలు అనే దరిద్రపు కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించి ఓటేయండి. ఇప్పటికే కాంగ్రెస్కు ఓటేసి తప్పుచేశామని కర్ణాటక ప్రజలు చెంపలేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ రావద్దు. కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేసి రైతుల నోటికాడి బుక్క లాక్కున్నట్టు రైతుబంధును ఆపించినయ్. ఆ పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి.
మోదీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ వందల మందిని బలితీసుకున్న బలిదేవత” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలో నిర్వహించిన రోడ్షోలో పార్టీ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సుమారు 30 వేలకు పైగా వచ్చిన ప్రజలతో పట్టణ వీధులు కిక్కిరిసి పోగా, వారినుద్దేశించి అమాత్యుడు రామన్న ప్రసంగించారు.
– హుజూరాబాద్/టౌన్/రూరల్, నవంబర్ 27
హుజూరాబాద్/టౌన్/రూరల్, నవంబర్ 27 : కాంగ్రెస్ అనే దరిద్రం కావాలా..? కడుపులో పెట్టి చూసుకుంటున్న కేసీఆర్ కావాలా..? ఆలోచించి ఓటెయ్యాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఓటర్లకు విన్నవించారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి 30 వేల మందికి పైగా తరలిరావడంతో పట్టణ వీధులు కిక్కిరిసిపోగా, వారినుద్దేశించి అమాత్యుడు ప్రసంగించారు. ఎన్నికలు వ్యక్తుల మధ్య కాదని, పార్టీల మధ్య పోరు జరుగుతున్నదని, అభివృద్ధి చేసే పార్టీ వైపు ఉండాలని సూచించారు.
నాటి తెలంగాణ ఉద్యమంలో ఎం తోమందిని కాల్చి చంపిన దుర్మార్గపు చరిత్ర కాం గ్రెస్దేనని, మొన్న జరిగిన ఉద్యమంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న బలి దేవత సోనియాగాంధీ అని మండిపడ్డారు. రైతుబంధు ఇప్పటికీ 11 సార్లు 70 లక్షల మందికి రూ.72 వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్దని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, ఆసరా వంటి సంక్షేమ పథకాలు ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని, అటువంటి పథకమైన రైతుబంధును నిలిపివేయాలని ఎన్నికల క మిషన్కు కాంగ్రెస్, బీజేపీ లేఖలు రాశాయన్నారు.
రైతుల మేలు కోసం రైతు బంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేయగా అధికారులు పచ్చ జెండా ఊపారని, మళ్లీ కిరికిరి పెట్టి అడ్డుకున్న దుర్మార్గులు కాంగ్రెస్, బీజేపీ నాయకులని మండిపడ్డారు. రైతుబంధు వస్తే రైతులంతా బీఆర్ఎస్కే ఓటు వేస్తారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి కుట్రలు పన్ని, రైతుల నోటి కాడికి వచ్చిన ముద్దను గద్దలు లాకున్నట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల సన్నాసులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
2014కు ముందు తెలంగాణలో కరెంటు కష్టాలు ఎలా ఉండేవో ప్రజలకు తెలుసునని, అప్పుడు ఎవరైనా చనిపోతే స్నానాలు చేయడానికి పది నిమిషాల కరెంటు ఇవ్వాలని అధికారులను బతిమిలాడుకునే రోజు లు ఉండేనని గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మొత్తం 24 గంటల కరెంటు ఇస్తూ ప్రతి ఇంటిలో వెలుగులు నింపిందని, కరెంటు కావాలో.. కాంగ్రెస్ కావా లో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టిన కాంగ్రెస్ దరిద్రం మళ్ళీ కావాలా? అంటూ ప్రశ్నించా రు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎకడ ఉంటే అకడ కరెంటు ఉండదని, కర్ణాటకలో ప్రజలంతా కాంగ్రెస్ను నమ్మి ఓటేసినందుకు ఇప్పుడు చెంప లు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మూడు గంటల కరెంటు,10 హెచ్పీ మోటర్, రైతుబంధు వద్దు, ధరణి రద్దు, పట్వా రీ వ్యవస్థ ముద్దు అంటున్న కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే మోటర్ల కాడ మీటర్లు బిగిస్తామని బాహాటంగానే చెబుతున్నదని, సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టలేదు కనుకనే తెలంగాణకు ఇచ్చే నిధులకు కోత పెట్టామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్న విషయా న్ని గుర్తు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ధన్ధన్గా జన్ ధన్ ఖాతాలు తీయమని చెప్పి, రూ.15 లక్షలు ఖాతాలో వేస్తామని కనీసం రూ.15లు కూ డా వేశారా? అని ప్రశ్నించారు. కేంద్రం రూ.15 లక్షలు వేస్తే బీజేపీకి ఓటు వేయాలని, లేదంటే రై తుబంధు, దళిత బంధు డబ్బులను ఖాతాల్లో వేసి న కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
దేశంలో పప్పు, ఉప్పు వంటి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఐగ్గె మండుతున్నాయని, అందుకే ప్రియమైన ప్రధానమంత్రి అనడం మానేసి ప్రజలంతా పిరమైన ప్రధాని అంటున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మార్చి పోతే సెప్టెంబర్లో రాసుకునే పరీక్షలు వంటివి ఈ ఎన్నికలు కాదని, ఐదేళ్ల మన జీవితాన్ని నిర్దేశించేవన్నారు.
కేసీఆర్ కొత్త మ్యానిఫెస్టో తయారుచేసి సౌభాగ్య లక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకి నెలకు రూ.3000 చొప్పున ఇవ్వనున్నారని, దీంతోపాటు పింఛన్ కూడా రూ.5000లకు పెంచుతామని తెలిపారు. నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పెంచితే సిలిండర్కు దండం పెట్టి ఓటు వేయాలని మోదీ ప్రజలను అభ్యర్థించి గద్దెనెక్కారని, అదే మోదీ ఇప్పుడు గ్యాస్ ధరను రూ.1200లకు పెంచితే మధ్య తరగతి ప్రజలకు భారం పడకుండా ఉండేందుకు కేవలం రూ.400లకే కేసీఆర్ అందించనున్నారని చెప్పారు.
ఈ ఎన్నికలు మూడు పార్టీల మధ్య జరుగుతున్నాయని ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉండి మన దమ్ము చూపి దుమ్ము లేపాలని పిలుపునిచ్చారు. ఈసారి హుజురాబాద్లో కౌశిక్రెడ్డిని గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని మాటిచ్చారు. గతంలో జరిగిన తప్పు ఇప్పుడు చేయద్దని కోరారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే కౌశిక్రెడ్డి ఎమ్మెల్యేగా గెలువడం ఖాయం అనిపిస్తుందన్నారు. సిరిసిల్ల తరహాలో అభివృద్ధి జరగాలంటే అక్కడ వచ్చిన మెజార్టీ కన్నా ఇక్కడ వస్తేనే హుజూరాబాద్ను సుందరవనంగా మారుతుందని చెప్పారు.
15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నామని, తమ కష్టాన్ని గుర్తించి ఒక్కసారి ఎన్నికల్లో గెలిపించి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్రెడ్డి సతీమణి శాలినీరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్లో రోడ్షోలో ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ఉండి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కౌశిక్ రెడ్డిని ఆదరించి గెలిపించాలని అభ్యర్థించారు.
అలాగే ప్రచారంలో కౌశిక్రెడ్డి కూతురు శ్రీనికారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సేవకు ప్రాధాన్యమిచ్చే తన తండ్రిని గెలిపించాలని ప్రజలను కోరింది. కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేటీఆర్ రోడ్ షో కార్యక్రమానికి తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో హుజూరాబాద్ గులాబీమయమైంది. హుజూరాబాద్, కమలాపూర్, మండలాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలిరావడంతో పట్టణంలోని సూపర్బజార్ చౌరస్తా నలువైపులా రహదారులు కిక్కిరిసిపోయాయి. దాదాపు 30వేలకు పైగా మందితో ఎటు చూసినా జన సందోహమే కనిపించింది.
15 ఏళ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ప్రజల మధ్య గడుపుతున్నా. ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్నా అంటే నేనున్నా అంటూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నా. దండం పెట్టి అడుగుతున్నా నా కష్టాన్ని గుర్తించండి. ఉప ఎన్నికల తరువాత రూ.50 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేశా. కేటీఆర్ కృషితో హుజూరాబాద్లో స్పోర్ట్స్ స్టేడియానికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశా. భూమిపూజ కూడా పూర్తయింది. నన్ను గెలిపిస్తే మినీ కలెక్టరేట్తోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపడుతా. ప్రజా ఆశీర్వాద సభలో నన్ను గెలిపిస్తే హుజూరాబాద్ను దత్తత తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పింది గుర్తుంచుకోండి.
కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయం. హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే బాగుంటుందో ఆలోచించాలి. ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకొని అయినా సరే రూ.వెయ్యి కోట్లు తీసుకువస్తా. సిద్దిపేట తరహాలో అన్ని విధాలుగా తీర్చిదిద్దుతా. మాటమీద నిలబడకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగ. అక్కాచెల్లెళ్లారా, అన్నాదమ్ముళ్లారా ఒకసారి ఆలోచించండి. ఒక అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని నిరంతరం అభివృద్ధి పథంలో నడిపిస్తా.
-బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి