కరీంనగర్ కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 28: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 17,564 మంది విద్యార్థులకు 16,996 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4309 విద్యార్థులకు గానూ 4125 మంది, పెద్దపల్లి జిల్లాలో 5,636 మంది విద్యార్థులకు గానూ 5323 మంది పరీక్ష రాశారు.
జగిత్యాల జిల్లాలో 7,270 మందికి గాను 6945 మంది హాజరయ్యారని కలెక్టర్ యాస్మిన్బాషా తెలిపారు. నిమిషం నిబంధనతో విద్యార్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకున్నారు. వెల్గటూర్ మండలంలోని ముంజంపల్లికి చెందిన మున్నాల సృష్టిత తాత రాజయ్య బుధవారం అనారోగ్యంతో మరణించాడు. తాత మృతదేహం ఇంటిలో ఉండగానే పరీక్షకు హాజరైంది.