మెట్పల్లి రూరల్, జూలై 30: ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, వాటి నష్టాన్ని వెంటనే అంచనా వే యాలని అధికారులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశించారు. మెట్పల్లి మండలంలోని రంగారావుపేట, కేసీఆర్ తండా, ఏఎస్సార్ తండా, మెట్లచిట్టాపూర్ గ్రామాల్లో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వం తెనలను సోమవారం పరిశీలించారు. రంగారావుపేట శివారులో నూతనంగా నిర్మిస్తున్న వంతెన ఎత్తు పెంచాలని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారీ వర్షాలకు నియోజకవర్గంలో ప్రజా రవాణా మార్గాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు దెబ్బతి న్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపి మరమ్మతులు, అవసరమైన దగ్గర కొత్తగా కల్వర్టులు, వంతెనలు నిర్మించేలా కృషి చేస్తానని తెలిపారు. అలాగే పంట నష్టాన్ని సైతం వ్యవసాయాధికారులు అంచనా వేయాలని, ప్రభుత్వం నుంచి రైతులకు పరిహారం అందేలా చూస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మారు సాయిరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు తీగల లింగారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి, సర్పంచులు బద్దం శేఖర్, ఆకుల రాజరెడ్డి, గుగ్లావత్ శంకర్నాయక్, నాయకులు గంగాధర్, చంద్రయ్య, అంజయ్య, ఎంపీడీఓ భీమేశ్రెడ్డి, ఎంపీఓ మహేశ్వర్రెడ్డి, తదితరులున్నారు.