కమాన్చౌరస్తా, మే 22: కరీంనగర్ ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామకృష్ణ ఉన్నత విద్యారంగ అభివృద్ధి కోసం 25 ఏండ్లుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సేవలను ప్రశంసిస్తూ ఢిల్లీకి చెందిన వందనా సంస్థ, జీసీసీఆర్ కౌన్సిల్ ఢిల్లీ సంయుక్తంగా ఇండియన్ ఐకాన్ అవార్డును ప్రకటించింది. ఆ అవార్డును కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా ప్రొఫెసర్ రామకృష్ణ బుధవారం అందుకున్నారు. కలెక్టర్తోపాటు వైస్ ప్రిన్సిపాల్ టీ రాజయ్య, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ కే సురేందర్రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ ఆడెపు శ్రీనివాస్, వీ శ్రీనివాస్, డాక్టర్ సతీశ్, డాక్టర్ ఓదెలు కుమార్, ఎన్సీసీ అధికారి పీ రాజు, డాక్టర్ మహేశ్, నాగేశ్వర్, లైబ్రేరియన్ కే సురేందర్ అభినందనలు తెలిపారు.