కార్పొరేట్ను తలదన్నేలా గురుకుల ఫలితాలు రాష్ట్ర ఫ్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాలలు ఇంటర్లో 92 శాతం ఫలితాలతో కార్పొరేట్ కళాశాలల తలదన్నేలా సత్తా చాటాయి. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలతో ఈ ఫలితాలు సాధించగలిగాయి. ఇది గర్వించదగ్గ విషయం. గొప్పలు చెప్పుకునే ప్రైవేటు కళాశాలలు కేవలం 63 శాతంతో సరిపెట్టుకున్నాయి.
– ఎండపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్
ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం విడుదల చేయగా, రెండింటిలోనూ వారే హవా కొనసాగించారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటగా, పలువురు అత్యధిక మార్కులు సాధించారు. జిల్లాలో మొదటి సంవత్సరం 14,217 మంది విద్యార్థులకు 9934(69 శాతం) మంది, ద్వితీయ సంవత్సరంలో 12,292 మంది విద్యార్థులకు 8677(70 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
– కమాన్చౌరస్తా, మే 9
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ రెండింటిలోనూ హవా కొనసాగించారు. పెద్దపల్లి జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫస్టియర్లో మొత్తం 5636 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 47.10 శాతంతో 2654 మంది పాసయ్యారు. ఇందులో జనరల్ కోర్సుల్లో 4458 మందికి 46.10 శాతంతో 2055 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సుల్లో 1,178 మందికి 599 మంది పాసయ్యారు. 50.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో మొత్తం 5,561 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,373 మంది పాసయ్యారు. 60.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో జనరల్ కోర్సుల్లో 4506 మందికి 2667 మంది పాసయ్యారు. 59.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సుల్లో 1,055 మందికి 706 మంది విద్యార్థులు పాసయ్యారు. 66.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా, అన్ని ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఫస్టియర్లో బాలురు 30.25 ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, బాలికలు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెరండయర్లో బాలురు 45.98 శాతం ఉత్తీర్ణత కాగా, బాలికలు 70.93 శాతం ఉత్తీర్ణత సాధించి టాప్గా నిలిచారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పెద్దపల్లి జిల్లా నోడల్ అధికారి డీ కల్పన, పెద్దపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పీ సుదర్శన్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మైత్రేయి, అధ్యాపకులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
జగిత్యాల జిల్లా విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపారు. సెకండియర్లో జిల్లా విద్యార్థులు 68 శాతం, మొదటి సంవత్సరంలో 58 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి సంవత్సరంలో 13వ స్థానం, రెండో సంవత్సరంలో 10వ ర్యాంకు సాధించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు. జిల్లాలో మొదటి సంవత్సరం బాలురు 2643 మంది పరీక్ష రాయగా, 1179 మంది పాస్ కాగా, రెండో సంవత్సరంలో 3048 మంది విద్యార్థులకు 1758 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం బాలికలు 3547 మంది పరీక్ష రాయగా, 2445 పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలో 3686 మంది విద్యార్థులకు 2848 మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరంలో 6190 మందికి 3624 పాస్ అవగా, రెండో సంవత్సరంలో 6734 మందికి 4606 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే, ప్రైవేట్ విద్యార్థుల్లో 746 మందికి 204 మంది పాస్ అయ్యారు. ఇంటర్ వొకేషనల్ పరీక్షల్లో 1199 మంది రా యగా, 487 మంది మొదటి సంవత్సరం, 1039 మందికి 549 మంది రెండో సంవత్సరంలో పాస్ అయ్యారు.
ఇంటర్ ప్రైవేటు వొకేషనల్లో 78 మంది పరీక్ష రాయగా, 18 మంది పాస్ అయ్యా రు. అలాగే, జిల్లాలోని తెలంగాణ ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో ఎండీ సాధిక్ ఎంపీసీ విభాగంలో 463, శివసాగర్ 456, సిద్దార్థ 455, శ్రీరాం 454, షానవాజ్ 450 మార్కులు సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 3941 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 2263 (57 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే, ద్వితీయ సంవత్సరంలో 3922 మంది హాజరు కాగా, 2688(69 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రతి ఏడాది లాగే బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ 67 శాతం, ద్వితీయలో 77 శాతంతో ముందజలో నిలిచారు. కాగా, బాలురు మొదటి సంవత్సరంలో 43 శాతం, ద్వితీయలో 56 శాతంతో సరిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సీహెచ్ మోహన్, జిల్లా విద్యాధికారి ఏ రమేశ్కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సిరిసిల్ల, బోయినపల్లి, మర్రిపల్లి, వీర్నపల్లి, తంగళ్లపల్లి కస్తూర్భా గాంధీ పాఠశాలలు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాయి. మొదటి సంవత్సరంలో సిరిసిల్ల కేజీబీవీ ఎంపీసీ విద్యార్థిని పీ శరణ్య 463, సెకండియర్ బైపీసీలో డీ అఖిల 964, మర్రిపల్లి కేజీబీవీ బైపీసీలో ఎం ప్రసన్న 430, పీ సంధ్య ఎంపీసీలో 985, తంగళ్లపల్లి ఎంపీహెచ్డబ్ల్యూలో కే సంధ్య 486, హాసిని 485, గంభీరావుపేట కేజీబీవీలో సెంకడియర్ ఎంపీహెచ్డబ్ల్యూలో నిఖిత 955, సీఈసీలో పీ మౌనిక 942 మార్కులతో ఉత్తమ ప్రతిభ సాధించారు.
కరీంనగర్ జిల్లా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 8వ స్థానం, మొదటి సంవత్సరం ఫలితాల్లో 5వ స్థానం కైవసం చేసుకుంది. ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో మొత్తం 12,292 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8677 (70శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 6106 మంది పరీక్షలు రాయగా 4005 మంది(65 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 6186 మంది పరీక్షకు హాజరు కాగా, 4672 మంది(75 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సరం వృత్తి విద్యా కోర్సుల్లో 1469 మంది పరీక్షలకు హాజరు కాగా, 906 మంది (61 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 833 మంది పరీక్షలకు హాజరు కాగా, 411మంది (49 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 636 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 495 మంది(77) శాతం ఉత్తీర్ణులైయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం 14,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 9934 (69 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 7471 మంది పరీక్షలు రాయగా 4784 (64 శా తం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 67 46 మంది పరీక్షలకు హాజరు కాగా 5150 మంది (76 శాతం) ఉతీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం వృత్తి విద్యా కోర్సుల్లో 43 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1738 మంది విద్యార్థులు పరీక్షలు రాయ గా, వారిలో 754 మంది ఉత్తీర్ణులయ్యా రు. బాలురు 1057 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 354 (33 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 681 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 400 (58 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.