గతంలో పంటలు సాగు చేయాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. దుక్కులు దున్ని తొలకరి కోసం వేచి చూడాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. వానల కోసం మొగులువైపు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. గోదావరి జలాలతో జలాశయాలు, చెరువులు నిండుగా మారడంతో నీళ్లకు ఢోకా లేకుండా పోయింది.
గురువారం రోహిణి కార్తె మొదలవుతున్నది. వానకాలం సాగును ప్రారంభించేందుకు ఇది మంచిరోజని, ఇప్పుడు ఎవుసం ప్రారంభిస్తే రాబడి మంచిగా వస్తుందని రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే యాసంగి పంట చేతికి రాగా, నేటి నుంచి సరికొత్తగా సాగేందుకు సిద్ధమవుతున్నారు.