గంగాధర, అక్టోబర్ 28: ‘కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచుతారు. రైతుబంధు బంద్ చేస్తారు. కరెంటు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కబంధహస్తాల్లో తెలంగాణ రాష్ట్రం చికకుండా కాపాడుకుందాం’ అని బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలను కోరారు. శనివారం గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి, సర్వారెడ్డిపల్లి, ముప్పిడినర్సయ్యపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు.
రైతులకు ఐదు గంటలకంటే ఎకువ ఇవ్వలేమని స్వయంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించడం అకడి పరిస్థితికి అద్దం పడుతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని కర్ణాటక రాష్ట్ర రైతులు కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో ప్రజలకు వివరిస్తూ నిరసన తెలుపుతున్నారని పేరొన్నారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు, పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లు కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తుందో వారికే తెలియదన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
ఐదేళ్లలో చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, రెండో సారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని పేరొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ్ మధుకర్, గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాసర్, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు తోట కవితామల్లారెడ్డి, చిలుముల మంజులారమేశ్, పబ్బతి మల్లమ్మ, కంకణాల విజయేందర్ రెడ్డి, మడ్లపెల్లి గంగాధర్, నాయకులు ఆకుల మధుసూదన్, అట్ల శేఖర్ రెడ్డి, కరబూజ తిరుపతి, భాష మియా, పబ్బతి తిరుపతిరెడ్డి, రేగుల తిరుపతి, చిలుముల సుధాకర్, ఇరుకురాల రవి, గంగాధర సంపత్, పెంచాల చందు తదితరులు పాల్గొన్నారు.