కార్పొరేషన్, ఏప్రిల్ 27: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నిజంగా రైతులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి. దమ్మూ, ధైర్యం ఉంటే కేం ద్రం నుంచి ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ప్రకటన చేయించాలి. అంతేకానీ దొంగనాటకాలు.. మొసలి కన్నీరు ఎందుకు..? వీళ్లకు తోడు కాంగ్రెసోళ్లు తయారైన్రు. వాళ్ల పాలన ఎట్లుంటదో మనం చూడలేదా..? కాంగ్రెస్ హయాంలో రా ష్ట్రంలో పంటలు వేయాలంటే రైతులు భయపడ్డ రు. వేసిన పంటలకు సాగునీరు లేక, సమయానికి కరెంట్ రాక, ఎరువులు అందక, మార్కెట్లో మద్ద తు ధర దొరక్క ఇలా విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చేదాకా దినదిన గండంగా బతికిన రోజులవి. ఇప్పుడు వాళ్లా మాట్లాడేది. ఈ రెండు పార్టీ లు గోతికాడ గుంటనక్కల్లా తయారైనయని’ నగ ర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తా రు.
గురువారం స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు కేంద్ర, రాష్ర్టాల్లో పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతం పదేండ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్న బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డా రు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అమలు చేస్తు న్న పథకాల్లాంటి ఒక్కటైనా అమలు చేశారా..? అని ప్రశ్నించారు. ఏనాడైనా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చారా..? అని నిలదీశారు. రాష్ట్రంలో గత కాంగ్రెస్ పాలనలో రైతులు పంట లు వేయాలంటే భయపడ్డారన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోతే రైతులను ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఏదో కొద్దిమంది రైతులకు హెక్టార్కు రూ.వెయ్యి, రూ.రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప రైతులందరినీ ఆదుకున్నా రా..? అని నిలదీశారు. 2014లో స్వరాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 3లక్షల87వేల మంది రైతులకు రూ. 1500 కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన గొప్ప చరిత్ర సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
అదే 2018 నుంచి కొత్తజిల్లా కరీంనగర్లో 1.72లక్షల మంది రైతులకు రూ.1553 కోట్ల రైతుబంధు ఇచ్చిన చరి త్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. స్వరాష్ట్రంలో..తెలంగాణ ప్రభుత్వంలోనే రైతులు సంతో షంగా బతుకుతున్నారన్నారు. బండి సంజయ్కి అసలు పసల్ బీమా గురించి ఏమైనా తెలుసా చెప్పాలని ప్రశ్నించారు. ఆ పథకం గురించి బండి మాట్లాడుతుండడం సిగ్గుచేటని, గతంలో రైతులు రూ.7కోట్ల ప్రీమియం కడితే.. బీమా కింద కేం ద్రం రూ.2 కోట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డా రు. బీజేపీ, కాంగ్రెస్లకు రైతులపై ఏ మాత్రం ప్రే మ లేదని, ఓట్ల కోసం దొంగనాటకాలు ఆడడం, ఫొటోలకు ఫోజులు కొట్టడం తప్ప చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తానొక్కటే చెబుతున్నా.. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం ప్రకటించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేననే విషయాన్ని గుర్తుచేసుకోవాని సూచించారు.
జిల్లాలో నిన్న మొన్నటి వరకు జరిగిన పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఎరువుల, విత్తనాల ధరలు పెంచుకుంటూ పోతున్నదని, రైతులపై భారం మోపడం అవసరమా..? అని ప్రశ్నించా రు. కాంగ్రెస్, బీజేపీల పనైపోయిందని, రైతులు నమ్మే పరిస్థితిలోలేరని, ఏకపక్షంగా బీఆర్ఎస్ ప్ర భుత్వం, కేసీఆర్ నాయకత్వంపై గొప్పనమ్మకంతో ఉన్నారని తెలిపారు. ఇక్కడ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, నాంప ల్లి శ్రీనివాస్, సాగర్, టీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్, కాశెట్టి శ్రీనివాస్, ఉయ్యాల శ్రీనివాస్గౌడ్, కుంభం అనిల్, బాలు పాల్గొన్నారు.