హుజూరాబాద్టౌన్, అక్టోబర్ 16: హుజూరాబాద్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు, నియోజకవర్గ నాయకుడు, కార్యకర్తలు సుమారు 200 మంది సోమవారం బీఆర్ఎస్లోకి రాగా, కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ జమ్మికుంటలో భారీ బహిరంగ సభ నిర్వహించిన రోజే గులాబీ గూటికి రాగా శ్రేణులను అయోమయంలో పడేసింది. ప్రధానంగా ఈటల ముఖ్య అనుచరుడు, నియోజకవర్గ నాయకుడు జవ్వాజి కుమారస్వామి, బీజేవైఎం హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి మార్క అరవింద్, వీణవంక మండల యూత్ కోఆర్డినేటర్ రాపర్తి అఖిల్, ఎలబాక కోఆప్షన్ సభ్యుడు పొన్నాల అనిల్, నియోజకవర్గ మైనార్టీ నాయకుడు ఎండీ జానీ, సహా 200 ముఖ్య కార్యకర్తలు పార్టీలో చేరారు. ముంగా జమ్మికుంటలో భారీ ర్యాలీ తీశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ఈటల ఓటమే తమ ధ్యేయమని ప్రతిజ్ఞ చేశారు. అక్కడి నుంచి నేరుగా హుజూరాబాద్కు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏడుసార్లు ఈటల గెలుపునకు కష్టపడినా కూడా తమకు తగిన గుర్తింపులేదని బీఆర్ఎస్లో చేరిన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశనుంచే ఈటల వెంట ఉన్నప్పటికీ తమను పట్టించుకోలేదని విచారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తిరిగి బీఆర్ఎస్లో చేరామని చెప్పారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నియోజకవర్గంలో చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమని బీఆర్ఎస్లో చేరడానికి కారణమయ్యాయని స్పష్టం చేశారు. యువకులు ఎదగాలంటే యువ నాయకుడు అవసరమన్నారు. కౌశిక్రెడ్డి యువకులందరికీ అవకాశాలు కల్పిస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత పటిష్టంగా మారిందని, ఈ సారి ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకున్న ఈటలను ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడని, ఏం చేసినా ఎవరూ నమ్మేస్థితిలో లేరన్నారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. చేరినవారిలో ఇంకా విజయగిరి రాకేశ్, కనుకుల రాజు, గోనె రాజు, ప్రవీణ్, వీరస్వామి, బ్రహ్మం, మహమ్మద్ పాషా, మహ్మద్ అసిఫ్, శ్రీకాంత్, బన్నీ, వంశీ, 200 మంది ముఖ్య కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేశ్, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి, మాజీ వైస్ ఎంపీపీ చుక రంజిత్కుమార్ పాల్గొన్నారు.