హుజూరాబాద్, డిసెంబర్ 3: తనను గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సేవకు అంకితమవుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రకటించారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆనందంగా ఉన్నదన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పౌడి కౌశిక్ విజయం సాధించిన సందర్భంగా హుజూరాబాద్లో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.
కౌశిక్రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను విజయం సాధించినప్పటికీ పార్టీ అధికారంలోకి రాకపోవడం బాధగా ఉన్నదన్నారు. నా విజయంలో పాలు పంచుకున్న పార్టీ శ్రేణులకు, అభిమానులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. నా వెనుకనే ఉండి నిత్యం ప్రచారంలో పాలు పంచుకున్న నా సతీమణి శాలినిరెడ్డి కృషి మరువ లేనిది. నా కుమార్తె శ్రీనికను మెచ్చుకోలేకుండా ఉండలేనని పేర్కొన్నారు.