హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 2: ‘నా లక్ష్యం ఒకటే. అది హుజూరాబాద్ అభివృద్ధి. ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. అం దుకు ఒక ప్రణాళిక సిద్ధం చేశా. అతి త్వరలోనే దాన్ని ప్రజల ముందు ఆవిషరిస్తా.’ అని హుజూరాబాద్ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరారు. హుజూరాబాద్ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే వచ్చానని, తనను గెలిపిస్తే ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లలో హామీలన్నీ నెరవేరుస్తానని, లేకుంటే మరోసారి ప్రజలను ఓట్లు అడగనని చెప్పారు.
రాష్ట్రం లో మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమం త్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో ఎకడా లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి శనివారం హుజూరాబాద్ పట్టణానికి వచ్చిన మండలివిప్ కౌశిక్రెడ్డికి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద ర్యాలీ లో ఆయన మాట్లాడారు. తనకు ఎమ్మెల్యే టికెట్ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ప్రేమతో వచ్చిన జనాన్ని చూస్తుంటే 50 వేలపై మెజార్టీతో గెలుస్తానననే ధీమా కనిపిస్తున్నదన్నారు.
మీరంతా ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్ నాయకత్వంలో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మినీ కలెక్టరేట్, కొత్త బ స్టాండ్, ఫుట్బాల్ స్టేడియం, చిలుకవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయిస్తానన్నారు. మోడల్ చెరువును టూరిజం స్పాట్గా ఏర్పాటు చేస్తానని పేర్కొన్నా రు. గతంలోనే హుజూరాబాద్లో 10 కోట్లతో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు మం జూరు చేయించానని గుర్తు చేశారు. హుజూరాబాద్లో అన్ని కుల సంఘాల భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయిస్తానని చెప్పారు. జమ్మికుంటను బిజినెస్ సెంటర్గా డిక్లేర్ చేస్తానని, పట్టణం చుట్టూ ఔటర్ రింగ్రోడ్ నిర్మాణం చేపడతామని తెలిపారు. అన్ని హంగులతో హుజూరాబాద్, జమ్మికుంటలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్, కౌన్సిల్ను మినీ అసెంబ్లీగా ఏర్పాటు చేస్తానన్నారు. జమ్మికుంటలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు మడిపల్లి వద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. ఇల్లందకుంట రాములవారి గుడిని టెంపు ల్ సిటీగా మారుస్తానని, 20 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
మం డలంలో నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మా ణం చేసి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. జమ్మికుంటలోని నాయిని చెరువును 100 కోట్లతో రిజర్వాయర్గా మార్చి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తానన్నారు. వీణవంక మండలంలో 30 కోట్లతో ఇప్పటికే డబుల్ రోడ్డు నిర్మాణం చేశానని గుర్తు చేశారు. చల్లూరు ను, వావిలాలను మండలాలుగా మార్చి అద్భుతమైన ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తామన్నారు. కమలాపూర్ మండలంలో స్పోర్ట్స్ స్టేడి యం, బస్టాండ్ నిర్మాణం చేపడతామన్నారు. శనిగరం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తానన్నా రు. జమ్మికుంటలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేస్తానన్నారు. గత రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. ఆయన ఉప ఎన్నికల్లో గెలిచి రెండేళ్లు కావస్తున్నా తట్టెడు మట్టి ఎత్తిపోయలేదని మండిపడ్డారు. గతంలో మోకాళ్లలోతులో ఉన్న హుజురాబాద్-సైదాపూర్ రహదారిని ఆరున్నర కోట్లతో నిర్మాణం చేశామని గుర్తు చేశారు. 100 కోట్లతో హుజురాబాద్ పట్టణంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేశామని తెలిపారు. జమ్మికుంటలో ప్రజలు ఏది అడిగితే అది చేశామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 5673 మందికి సీఎంఆర్ కళ్యాణ లక్ష్మి చెకులను ఇంటింటికి తిరిగి స్వయంగా అందించానన్నారు. 25 కోట్లతో కల్వల ప్రాజెక్టును మినీ ఎల్ఎండీగా మారుస్తానని హామీ ఇచ్చారు.