కోహెడ అక్టోబర్ 30: తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ చేయాలని చూస్తున్న కేసీఆర్ను ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిని చేయాలని హుస్నాబద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ అన్నారు. సోమవారం పార్టీ ఎన్నికల ఇంచార్జీ ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి మండంలోని పరివేద, నకిరకొమ్ముల, శ్రీరాములప్లి, తీగలకుంటపల్లి, గొట్లమిట్ల, నారాయణపూర్, విజయనగర్కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే సతీష్కుమార్ను ఘనంగా స్వాగతించారు. పూలు చల్లుతూ తిలకం దిద్ది ఆశీర్వదించారు.
బతుకమ్మ ఆటలు ఆడి సంబురాలు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమన్నారు. తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ర్టాన్ని మెనిఫెస్టోలో ఇచ్చిన హామిలతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలు అమలు చేసి చూపించాడన్నారు. సాగునీరు, త్రాగు నీరు, 24 గంటల విద్యుత్, విధ్య, వైధ్యం తదితర రంగాలలో ఆగ్రగామిగా రాష్ర్టాన్ని నిలిపాడన్నారు. కల్యాణలక్ష్మి, షాదిముబారక్, రైతుబంధు, రైతు భీమా, ఆరోగ్యశ్రీ, కేసీఆర్కిట్,కంటి వెలుగు, డబుల్బెడ్రూం తదితర పథకాలను అమలు చేసి ప్రజలకు చేరువయ్యాడన్నారు.
ఆసర పథకంతోఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈకార్యక్రమాలలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కొక్కుల కీర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పారపు జ్యోతి, వైస్ఎంపీపీ తడ్కల రాజిరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు నాగరాజు మధుసుధన్రావు, కొక్కుల సురేశ్, మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల మహేందర్, నాయకులు లింగం గీతాంజలి, వెల్దండి సతీష్, ముంజ మంజుల, వేముల శ్రీనివాస్, బొలుమల్ల చంద్రయ్య, అన్నవేని కనుక య్య, మెట్టు రాజేందర్రెడ్డి, ఇప్పరపల్లి కృష్ణమూ ర్తి, పొన్నాల లక్ష్మణ్, తిప్పారపు శ్రీకాంత్, తోట ఆంజనేయులు, తైదల రవీందర్, సంది శ్రీనివాస్రెడ్డి, ముంజ శ్రీనివాస్, కన్నం రాజు, బత్తిని తిరుపతి, జాలిగాం శంకర్, సుతారి కనుకయ్య, కోహె డ పర్శరాములు, వేముల వీరస్వామి, బబ్బురు శ్రీనివాస్, ఆవుల చిన్న మహెందర్ ఉన్నారు.