కమాన్చౌరస్తా/ ముకరంపుర డిసెంబర్ 23 : యువత ఉద్యోగాల కోసం ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎల్ శ్రీలత పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆజాదికా అమృత్ మహోత్సవ్లో భా గంగా స్వశక్తి కళాశాలలో గురువారం నిర్వహించిన మినీ జుబ్ మేళాను ఆమె ప్రారంభించి మా ట్లాడారు. మినీ జాబ్ మేళాలో 12 సంస్థల ప్రతినిధులు పాల్గొనగా, 1140 మంది గ్రామీణ ప్రాం తాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల శక్తి సామర్థ్యాల ఆధారంగా అభ్యర్థులను కంపెనీలే ఎంపిక చేసుకున్నాయని తెలిపారు. కాగా, 1140 అభ్యర్థుల్లో 566 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. అలాగే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇం దులో భాగంగా ఉచిత శిక్షణ కోసం 58 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ సీహెచ్ ప్రవీణ్ కుమార్, డీపీఎం సీహెచ్ భార్గవ్, జేడీఎం సంతోష్కుమార్, ఏపీఎం కే ని రంజన్, సీహెచ్ జ్యోతి, రాజేశం, మహేశ్వరి, నాగశ్రీ, దినేష్, డీఎంజీలు, తదితరులు పాల్గొన్నారు.