వేములవాడ టౌన్, అక్టోబర్ 31 : కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వ తీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎటుచూసినా సంద డి కనిపించింది. తలనీలాలు సమర్పించారు. కోడెమొక్కు తీర్చుకున్నారు. క్యూలో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు.
అభిషేకపూజలు, అన్నపూజలు, కుంకుమపూజలు, సత్యనారాయణ వ్రతాలు, కల్యాణ మొక్కులు, పల్లకీ సేవలు, పెద్ద సేవలు నిర్వహించుకున్నారు. కా ర్తీక దీపాలను వెలిగించుకున్నారు. రాజన్నను దా దాపు 60వేల మంది దర్శించుకున్నారని, ఆర్జిత సేవల ద్వారా సుమారు 26 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.