విద్యానగర్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందని ఆందోళన చెందే కంటే.. అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో మేలని చెబుతున్నారు వైద్యులు. ఐదు రోజుల పాటు కొవిడ్ మందుల వాడకంపై ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రత్యేక కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తూ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా చర్యలు చేపట్టింది. పాజిటివ్గా నిర్ధారణ జరిగిన వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటే.. హోం ఐసొలేషన్ సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా చికిత్స పొందుతున్న వారికి ఇంటికే హోం ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ద్వారా పాజిటివ్ వ్యక్తులున్న ఇండ్లకు వెళ్లి వీటిని అందజేస్తున్నారు.
ఇవి తప్పనిసరి
ప్రతి రోజూ జ్వరం చెక్ చేసుకోవాలి. 6 నిమిషాలు సాధారణంగా నడవాలి. జ్వరం తగ్గకపోయినా, నడిచినప్పుడు ఆయాసం వస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లు, హార్ట్, కిడ్నీ ఇతర జబ్బులు లేనివాళ్లు మాత్రమే హోం ఐసొలేషన్లో ఉండాలి. మిగతా వాళ్లు
హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి.
గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రత్యేక గదిలోనే ఐసొలేషన్ పాటించాలి.
ప్రత్యేకంగా బాత్రూమ్ ఉండాలి.
నిబంధనల ప్రకారం ఇంట్లో వృద్దులు, హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న చోట ఐసొలేషన్లో ఉండకూడదు.
వాళ్లను వేరే చోటుకు పంపించడమో, లక్షణాలున్న వాళ్లే వేరే చోట ఉండటమో చేయాలి. ఎందుకంటే కరోనా రోగుల నుంచి వీళ్లకు త్వరగా వైరస్ వ్యాప్తి చెందొచ్చు.