ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, శనివారం నుంచి బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ ల్యాబ్లలో134 పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. కాగా, వీటిని రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లిలో టీ-డయాగ్నోస్టిక్స్ హబ్, డయాలసిస్ సెంటర్, కరీంనగర్లో అదనపు వైద్య పరీక్షలు, సిరిసిల్లలోని పెద్దూరు శివారులో రేడియాలజీ హబ్, జగిత్యాలలో పాథలాజికల్ పరీక్షల అప్గ్రేడేషన్ను ప్రారంభించగా, పేదలకు మరిన్ని వైద్య సేవలు చేరువయ్యాయి. కాగా, మారుమూల ప్రాంత ప్రజలకూ మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఎక్కడా లేని విధంగా టీ- డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఒకే చోట 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు.
– విద్యానగర్, జూలై 1
కరీంనగర్ విద్యానగర్/పెద్దపల్లి టౌన్/ జగిత్యాల అర్బన్/ సిరిసిల్ల రూరల్/ జూలై 1: వైద్య రంగంలో అనేక రకాల మార్పులకు శ్రీకారం చు డుతున్న రాష్ట్ర సర్కారు, అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నది. ప్రైవేట్లో టెస్టుల పేరిట చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు టీ-డ యాగ్నోసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. అం దులో 57 రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తుండగా, తాజాగా 134 రకాల పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వర్చువల్ విధానంలో ఈ సేవలను ప్రారంభించారు.
పెద్దపల్లిలోని ప్రభు త్వ దవాఖాన ఆవరణలో 5.25 కోట్లతో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ హబ్, కోటితో ఏర్పాటు చేసిన ఐదు పడకల డయాలసిస్ సెంటర్ను.. కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో అదనపు వైద్య పరీక్షలను, జగిత్యాల మాతా శిశు కేంద్రంలోని టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో పాథాలజీ పరీక్షల అప్గ్రేడేషన్ను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు శివారులో రేడియాలజీ హబ్ను ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వర్చువల్ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీ- డయాగ్నోస్టిక్స్ కేం ద్రాలు ఏర్పాటు చేసి, ఒకే చోట 134 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటివల్ల దాదాపు ప్రజలకు వెయ్యి నుంచి 10 వేల వరకు ఖర్చు భారం తగ్గుతుందన్నారు. ప్రజలకు కష్టతరంగా మారిన తలసేమియా, మీమోథెరపీ, హిమోఫీలియా,అనీమియా, పాథాలజీ, రేడియాలజీ, ఇ మ్యునో, హిస్టోకెమిస్ట్రీ, హెచ్ఐవీ, యాంటీ బ్యాక్టీరియల్ టెస్ట్, వైరల్ లోడ్ టెస్ట్ వంటి 77 రకాల పరీక్షలు చేస్తారని తెలిపారు. వీటి నిర్వహణకు ఏడాదికి 6 కోట్ల 9లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్యం
రాష్ట్రంలోని మారుమూల ప్రాంత ప్రజలకూ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. వైద్యఆరోగ్యశాఖ వైభవాన్ని పెంచే దిశగా అనేక సంసరణలను తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం 8 పాథాలజీ, 16 రేడియాలజీ ల్యాబ్లను ప్రారంభించుకున్నాం. ఇప్పటికే 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నాం. శనివారం నుంచి ఒకే చోట 134 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉన్నది. వీటి వల్ల ప్రజలకు వెయ్యి నుంచి 10 వేల వరకు ఖర్చు భారం తపుపతుంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్యపరంగా అనుసరిస్తున్న విధానాలకు గానూ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపును సంపాదించాం. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చర్యలు చేపట్టాలి. బొగ్గుగని కార్మికుల కోరిక మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీకి సింగరేణి మెడికల్ కళాశాలగా పేరు మార్చాం. ఈ కళాశాలలో కొత్తగా 40 మంది వైద్య పోస్టులు కేటాయించాం. త్వరలోనే డ్యూటీలో చేరుతారు.
– వర్చువల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు