కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్19: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం ఉప సర్పంచ్ మేడి తిరుపతి 24 గంటలు గడవకముందే సొంతగూటికి చేరుకున్నారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన, రాత్రి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తిరుపతికి ఎమ్మెల్యే గులాబీ కండువాకప్పి ఆహ్వానించారు.
ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ముస్కె శ్రీకాంత్, గొడుగు సతీశ్, కిరణ్, హరీశ్, కాటయ్య, గొడుగు సంపత్, పైడిపెల్లి సతీశ్, ధర్ముల సంపత్, పెంట మల్లేశ్, రాజ్కుమార్, ఆకారం శ్రీనివాస్రెడ్డి, మల్లారెడ్డి, ముస్కు సతీశ్, మంద రాజిరెడ్డి సైతం బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ కొనుకటి మల్లారెడ్డి, ఎంపీటీసీ కదురు మానస సతీశ్, విండో చైర్మన్ గజవెళ్లి పురుషోత్తం, బీఆర్ఎస్ నాయకులు హుస్సేన్ , ఆవుల తిరుపతి, శ్రీనివాస్, ముస్కు అశోక్, దామ రవి, చంద్రయ్య, తిరుపతి, కూస సతీశ్, కూస శ్రీకాంత్, వెంకటసాయి, ఆడెపు రాజు, సుదాటి కరుణాకర్రావు, కోటి తదితరులు పాల్గొన్నారు.