తిమ్మాపూర్ : మండలంలోని మహాత్మానగర్ గ్రామశివారులోని రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
సిద్దిపేటకు చెందిన జుబేర్ (19), సందీప్ మంగళవారం రాత్రి బైక్పై సిద్దిపేట నుంచి కరీంనగర్కు వెళ్తుండగా మహాత్మానగర్ గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జుబేర్ అక్కడిక్కడే మృతి చెందగా, సందీప్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.