సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మరోసారి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదయ్యాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.9డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.9డిగ్రీలు, గాలిలో తేమ 60 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా రుతుపవన ద్రోణి ప్రభావంతో రాగల 36గంటల్లో గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.