Chigurumamidi | చిగురుమామిడి, మే 12 : చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ వద్ద పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఆలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుండి మంటపారాధనలు, నిత్య హోమాలు నిర్వహించారు. సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.
మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చన, మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలు, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ఆంజనేయస్వామి జయంతి వేడుకలను పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి పీఠాధిపతి గురు ఉమేష్ స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు.