హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట్ గ్రామానికి చెందిన దికొండ స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల విషయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే తక్షణం స్పందించి చర్యలు చేపట్టారు. స్వామి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని లక్ష రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని ఎమ్మెల్యే అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
అదేవిధంగా సికింద్రాబాద్ పరిధి సీతాఫల్మండి నివాసి మధుకర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్పందించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ బాధితుడికి రూ.5.5 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని అందజేశారు.