తిమ్మాపూర్ రూరల్, జనవరి 2: నియోజకవర్గ వ్యాప్తంగా పలు ఆలయాల్లో సోమవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగగా, దైవదర్శనానికి తరలివచ్చిన వారిలో భక్తిభావం ఉప్పొంగింది. ఎల్ఎండీలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం, శ్రీతాపాల లక్ష్మీనృసింహ స్వామి ఆలయంతో పాటు మండలంలోని ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దైవ దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల కోసం ఆయా ఆలయ కమిటీల బాధ్యులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆలయ కమిటీల బాధ్యులు, అధికారులు పాల్గొన్నారు.
మానకొండూర్లో..
మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువ జాముననుంచే భక్తులు ఉత్తర ద్వారదర్శనం చేసుకున్నారు. భక్తుల సౌకర్యం కోసం ఆలయ కమిటీ సభ్యులు దేవాలయంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకుడు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, ఎంపీటీసీలు పిట్టల కవిత. ఉండింటి సులోచన, ఉపసర్పంచ్ నెల్లి మురళి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పిట్టల మధు తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, జనవరి 2: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భక్తులు వైష్ణవ ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయం, కేశవపట్నం హనుమాన్ ఆలయం, కన్నాపూర్-ధర్మారం శివారులోని శ్రీమాతా వాలీ సుగ్రీవ రామాలయం, తదితర ఆలయాల్లో అర్చకులు పంచామృతాభిషేకాలు, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కేశవపట్నంలో శివాలయం నుంచి హనుమాన్ ఆలయం వరకు భక్తులు నగర సంకీర్తన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కొత్తగట్టు సర్పంచ్ కిషన్రావు, కన్నాపూర్ ఎంపీటీసీ మోతె భాగ్యలక్ష్మి, హనుమాన్ ఆలయ చైర్మన్ తనుకు ఓంకారం, మాజీ సర్పంచ్ సదానందం, భక్తులు కర్మకొండ రాజయ్య, పాలడుగుల బాబన్న, తనుకు ప్రభాకర్, జగదీశ్వరయ్య, తనుకు సత్యనారాయణ, అల్లెంకి మనోహర్, శంకరానందం, నాగభూషణం, వంగ సత్యనారాయణ, మర్యాల కృష్ణమూర్తి, సోమేశ్వర్, రమేశ్, కాటం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
మండలంలోని సుందరగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ తాళ్లపల్లి సంపత్ గౌడ్, ఆలయ ఈవో రాజకుమార్, జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజమహేంద్ర నాయక్, హుస్నాబాద్ సివిల్ జడ్జి శివరంజని, ఎంపీపీ కొత్త వినితాశ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సర్పంచులు శ్రీ మూర్తి రమేశ్, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ఆలయ పాలకవర్గం, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇందుర్తిలోని హరిహర క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు తరలివచ్చారు.
గన్నేరువరంలో..
గన్నేరువరం మండలం ఖాసీంపేటలోని మానసాదేవి ఆలయంతో పాటు మైలారం మల్లికార్జున స్వామి, పారువెల్ల లక్ష్మీగణపతి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిథులు, ఆలయ కమిటీలు, భక్తులు పాల్గొన్నారు.