IKP purchasing center | చిగురుమామిడి, అక్టోబర్ 28 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోతో హుస్నాబాద్ నుండి హుజరాబాద్ వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎస్సై సాయి కృష్ణ, ఇరిగేషన్ ఏఈ నెహ్రూ, గ్రామస్తుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూమి రైతులకు ఆమోదయోగ్యంగా ఉన్నట్లయితే ప్రభుత్వానికి ఇబ్బంది లేదని, ఈ ప్రభుత్వ భూమిపై పూర్తి నివేదికను రెండు రోజుల్లోగా కలెక్టర్ కు అందజేస్తామని వారు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించనిచో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.