ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థుల రాకతో సందడిగా మారాయి. మొన్నటిదాకా సెలవుల్లో గడిపిన చిన్నారులంతా నిన్నటి నుంచి ఉత్సాహంగా బడిబాట పట్టారు. కొందరు తల్లిదండ్రుల చేయిపట్టుకొని వచ్చారు.
కొత్తవారిని పరిచయం చేసుకుంటూ, పాతవారితో ముచ్చటిస్తూ గడిపారు. తరగతి గదిలో బెంచీలను వెతుక్కుని మరీ కూర్చున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి పాఠశాలల పునఃప్రారంభం రోజే అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు బారులు తీరారు. గంభీరావుపేట కేజీ టూ పీజీ స్కూల్లో తొలిరోజే 40 మంది అడ్మిషన్లు తీసుకున్నారు.
– కమాన్ చౌరస్తా, జూన్ 12