పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 18: స్నేహితుడితో కలిసి బైక్పై శుభ కార్యానికి వెళ్తున్న వ్యక్తి మృత్యు ఒడికి చేరాడు. రైండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమా దంలో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఈ దుర్ఘటన పెద్దపల్లి మండలం రాంపల్లిలో జరిగింది. పెద్దపల్లి ఎస్ఐ సహదేవ్ సింగ్, కథనం ప్రకారం.. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గొర్ల రిషికేష్(19) అదే మం డలం ముల్కాల గ్రామానికి చెందిన తన స్నేహితుడు తిప్పని సాయికృష్ణతో కలిసి ఆదివారం బైక్పై మంచిర్యాలకు ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన పచ్చళ్ల వ్యాపారి కస్తూరి వెంకటేశ్ భార్య హేమతో ఆర్కే 6 నుంచి జమ్మికుంటకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. పెద్దపల్లి మండలం రాంపల్లి వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రిషికేష్ గొం తులో బైక్కు సంబంధించిన ఇనుప చువ్వ గుచ్చుకున్నది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. సాయికృష్ణ, క్తూరి వెంకటేశ్ కాళ్లు విరిగిపోయాయి. హేమ చాతి, కడుపులో గాయాలయ్యాయి. క్షతగాత్రులకు పెద్దపల్లి దవాఖానలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు. కాగా, సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సహదేవ్సింగ్ తెలిపారు.
మల్యాల,డిసెంబర్ 18: బొలెరో వాహనం, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మర ణం చెందారు. మల్యాల ఎస్ఐ మంద చిరంజీవి కథనం ప్రకారం.. కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన లైశెట్టి వెంకటేశ్(30), కొడిమ్యాలకు చెందిన చెన్న లక్ష్మీనారాయణ(48) కొండగట్టు దిగువన భోజనాలు వండుకుని తిని కొడిమ్యాలకు బైక్పై తిరిగి వస్తున్నారు. కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారిపై బల్వంతాపూ ర్ శివారులో బొలేరో వాహనం, బైక్ ఎదురెదురుగా ఢీకొనగా వెంకటేశం తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీనారాయణను జగిత్యాల దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంకటేశం తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.