వేములవాడ టౌన్/ ధర్మపురి సెప్టెంబర్ 29 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి, ధర్మపురిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు కూష్మాండ అవతారంలో దర్శనమిచ్చారు.
గోధుమ రంగు చీరలో మల్లెపూలు, బిల్వపత్రి దండలు ధరించిన జగన్మాత కనువిందు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దుర్గాదేవిని దర్శించుకుని అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు.