Hanging | మేడిపల్లి, మే 4 : తోటి విద్యార్థులకన్నా టెన్త్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భీమారం మండలం ఒడ్యాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మాడ శ్రీధర్ రెడ్డి కథనం ప్రకారం.. భీమారం మండలం ఒడ్యాడు గ్రామానికి చెందిన నిమ్మల రక్షిత (15) కు ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తోటి విద్యార్థులకన్నా తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆమె మానసికంగా ఆవేదనకు గురైంది.
జీవితంపై విరక్తి చెందిన నిమ్మల రక్షిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి తల్లి నిమ్మల సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.