కార్పొరేషన్, అక్టోబర్ 12 : బీఆర్ఎస్లో చేరిన యువతకు పార్టీ అండగా నిలుస్తుందని, వారి భవిష్యత్తు బాధ్యత తనదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. నగరంలోని పలువురు యువకులు స్థానిక మంత్రి మీ సేవా కార్యాలయంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరిన యువత భవిష్యత్తు బాధ్యత తనదేనని అభయం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరీంనగర్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సహకారంతో నగరాభివృద్ధికి రూ.వందల కోట్ల నిధులు తీసుకొని వచ్చినట్టు వెల్లడించారు. నగరంలో ఎకడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరం రాత్రిపూట జిగేల్మంటున్నదని, కరీంనగర్ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చామని, మానేర్ రివర్ ఫ్రంట్ పనులు 25 శాతం పూర్తి చేశామన్నారు.
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీ పార్టీలు అని, బీఆర్ఎస్ ఒకటే మన ఇంటి పార్టీ అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచన అంతా తెలంగాణ అభివృద్ధి అని, దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ చేతులు బలోపేతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, మంత్రి కేటీఆర్ సహకారంతో హైదరాబాద్కు పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలు తరలి వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు పాల్గొన్నారు.