హుజూరాబాద్టౌన్, డిసెంబర్ 2: టాస్ ద్వారా ఇప్పటివరకు అనేకమంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్ పబ్లిక్ రిలేషన్ మేనేజర్ గంగా ప్రసాద్ పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్ కేసీ విభాగం ఆధ్వర్యంలో టాస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి కళాశాల ప్రిన్సిపాల్ గొడిశాల పరమేశ్ అధ్యక్షత వహించగా గంగాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టాస్ ద్వారా కరీంనగర్ జిల్లాలో 1800 మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించడం సంతోషకరమన్నారు. టాస్లో విద్యార్థి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ సంస్థ ద్వారా కమ్యూనికేషన్ సిల్స్, టెక్నికల్ సిల్స్, 21వ సెంచరీ సిల్స్ పై అవగాహన కల్పిస్తారన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గొడిశాల పరమేశ్ మాట్లాడుతూ టాస్ సంస్థ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు ఉద్యోగానికి కావాల్సిన కనీస నైపుణ్యాలను పెంపొందిస్తుందని పేరొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ పీఎల్యన్ మూర్తి మాట్లాడుతూ విద్యార్థి ఉద్యోగం సంపాదించడంలో కమ్యూనికేషన్ సిల్స్ ముఖ్యమన్నారు. అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ జీ శ్రీనివాస్ మాట్లాడుతూ టాస్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసి ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్ కేసీ కో ఆర్డినేటర్ శ్యామలాదేవి, అధ్యాపకులు రాజకుమార్, నాగ పరమేశ్వరాచారి, స్వరూపరాణి, స్వప్న, పాషా, టీఎస్ కేసీ మెంటర్ శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.