బోయినపల్లి, జనవరి 19: కంటి సమస్యల తో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక నరకయాతన అనుభవిస్తున్న పేదలకు పైసా ఖర్చులేకుండా రాష్ట్ర సర్కారు వైద్యం అందిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. అంధత్వ రహిత తెలంగాణే సర్కారు లక్ష్యమని, పేద ప్రజల్లో వెలుగు నింపేందుకే కంటి వెలుగును నిర్వహిస్తున్నదని చెప్పారు. గురువారం బోయినపల్లి ఆర్ఎంపీ భవనంతోపాటు కొడిమ్యాల మండలం నల్లగొండ, గంగాధర మండలం బూరుగుపల్లిలో కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. బోయినపల్లిలో డీసీఎమ్మెస్ మాజీ చైర్మ న్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండ య్య, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీవో రాజేందర్రెడ్డి, ఎంపీవో గంగాతిలక్, వైద్యాధికారి రేణుక, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, వైస్ఎంపీపీ కొనుకటి నాగయ్య,సర్పంచ్ గుంటి లతశ్రీ,ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, మండల బీ ఆర్ఎస్ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్ పాల్గొన్నారు.