రోజూ కూలీ పనిచేస్తేనే పూట గడిచే ఓ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. తొలిసూరు బిడ్డ గుండె సంబంధిత సమస్యలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, తల్లడిల్లిపోతున్నది. పుట్టుకతోనే రక్తనాళాలు మూసుకుపోవడంతో 4లక్షలు అప్పుచేసి వైద్యం చేయించిన తల్లిదండ్రులకు అంతలోనే మళ్లీ పిడుగులాంటి వార్త వినిపించింది. అంతా బాగానే ఉందనుకున్న టైంలో చిన్నారి హార్ట్లో హోల్ ఉందని, చికిత్సకు మరో 8లక్షలు అవుతుందని వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పాపను బతికించాలని వేడుకుంటున్నారు.
కొడిమ్యాల, ఫిబ్రవరి 12: కొడిమ్యాలకు చెందిన చిలువేరి నరేశ్, శరణ్యది పేద కుటుంబం. రోజూ పనిచేస్తేనే పూట గడుస్తుంది. వీరికి రెండేండ్ల క్రితమే వివాహమైంది. అయితే నాలుగు నెలల క్రితం శరణ్యకు మొదటికాన్పులో ఆడ శిశువు ధన్విక జన్మనిచ్చింది. అయితే ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్ దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్లోని రెన్బో హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గుండెకు సంబంధించిన రక్తనాళాలు మూసుకుపోయి బ్లడ్ సరఫరా సరిగ్గా కావడం లేదని, ఆపరేషన్ చేయాలని చెప్పారు.
ఈ క్రమంలో తల్లిదండ్రులు 4లక్షల దాకా అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. అంతా బాగుందని అనుకున్న సమయంలో చిన్నారికి జనరల్ పరీక్షలు చేయించగా, గుండెకు హోల్ ఉందని తేలడంతో ఆందోళన చెం దారు. ఈ నెలలోనే ఆపరేషన్ చేయించాలని, అందుకు మ రో 8లక్షల దాకా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఇప్పు డు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని తల్లడిల్లుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాయం చేయాలనుకునేవారు నరేశ్ 8143203264కు ఫోన్ పే లేదా గూగుల్ పే చేయాలని, లేదా యూనియన్ బ్యాంక్ కొడిమ్యాల బ్రాంచ్ (అకౌంట్ నంబర్ 080410100027341 – ఐఎఫ్ఎస్సీకోడ్ యూబీఐఎన్0808041) కు డబ్బులు పంపాలని కోరుతున్నారు.