కోననావుపేట, మార్చి1: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించేందుకే కష్టపడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి నాలుగు కొలువులు కొట్టి ఆదర్శంగా నిలిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన దుగ్గు మనీష. రాజేందర్, లలిత దంపతుల రెండో కూతురైన ఈమె, చిన్ననాటి నుంచే చదువులో ముందుండేది.
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2023లో గురుకుల నియామక బోర్డు (ట్రిబ్) నోటిఫికేషన్ వేయగా, చాలా కష్టపడి చదివింది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో సత్తాచాటి పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కొలువులు సాధించి పలువురి ప్రశంసలందుకున్నది.