Dasari Manohar Reddy | పెద్దపల్లి రూరల్, జనవరి 31 : పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు దాసరి రఘనందన్ రెడ్డి అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే దాసరి స్వగ్రామమైన కాసులపల్లికి చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు రఘునందన్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పెద్దపల్లి మండలం కాసులపల్లికి చేరుకుని దాసరి రఘునందన్ రెడ్డి పార్థీవ దేహాం పై పూలమాల వేసి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తన ప్రగాఢ సంతాతం తెలుపుతూ సానుభూతి వ్యక్తం చేసి మనోధైర్యంతో ఉండాలని సూచించారు.