గంభీరావుపేట, ఫిబ్రవరి 4: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గ్రామాల్లో ప్రజలకు సర్పంచులు అందించిన సేవలు అభినందనీయమని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ కొనియాడారు. పదవులు లేకు న్నా.. ప్రజాసేవలో ఉండడం గొప్పతనమని.. రానున్న రో జుల్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గజసింగవరంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆధ్వర్యంలో మండల మాజీ సర్పంచులు, పాలకవర్గ సభ్యులకు ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఏర్పాటు చేయగా, మాజీ ఎంపీ వినోద్కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సర్పంచులు అందించిన సేవలు చిరస్థాయిలో నిలుస్తాయన్నారు. గ్రామాల్లో పల్లెపార్కులు, సీసీ రోడ్లు, మురుగుకాలువలు, హరితహారం, వైకుంఠధామాలు, బ తుకమ్మ ఘాట్లు, చెరువుల మరమ్మతులు, తదితర నిర్మాణాలు చేపట్టి స్వరాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న మీ సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. అంతకు ముందు కొండూరి రవీందర్రావు మండల మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో పల్లెలను ప్రగతి బాటలో నడిపిస్తూ, మీ సేవలు చిరకాలం గుర్తుండేలా చేశారని, రానున్న రోజు ల్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కొండూరి సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణ రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ప ర్శ హన్మాండ్లు, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సు రేందర్రెడ్డి, లింగన్నగారి దయాకర్రావు, హన్మంతరెడ్డి, రా జేందర్, కమ్మరి రాజారాం,సదాశివరెడ్డి పాల్గొన్నారు.