గంగాధర, మార్చి 21: కరీంనగర్లో ఈ నెల 23న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపినిచ్చారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, నాయకులు సాగి మహిపాల్రావు, కంకణాల విజేందర్రెడ్డి, ఆకుల మధుసూదన్, వేముల దామోదర్, మడ్లపెల్లి గంగాధర్, రామిడి సురేందర్, ఎండీ నజీర్, దూలం శంకర్గౌడ్, కర్ర శ్రీనివాస్రెడ్డి, ముక్కెర మల్లేశం, వడ్లూరి ఆదిమల్లు, శ్రీమల్ల మేఘరాజు, జోగు లక్ష్మిరాజం, పొట్టల కనకయ్య, గడ్డం స్వామి, ఇరుగురాల రవి, మామిడిపెల్లి అఖిల్, జలందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.