Rasamayi Balakishan | సిరిసిల్ల టౌన్, జూన్ 11 : రాజన్న సిరిసిల్ల జిల్లా లో సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయు బాల కిషన్ పరామర్శించారు. ఇటివల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ మేరకు గురువారం ఆయన సిరిసిల్ల లో చిక్కాల రామారావు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ మల్లు గారి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పల్లె నర్సింహారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.