ఇల్లంతకుంట, మార్చి 10 : కరీనంగర్లో ఈ నెల 12న నిర్వహించనున్న కేసీఆర్ కదనభేరి బహిరంగసభకు వెల్లువలా కదిలిరావాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఇల్లంతకుంటలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల మీటింగ్లో న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. కొండూరి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్న కరీంగనర్ సభకు కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి సత్తాచాటాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమల్లో విఫలమైందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. ఇక్కడ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ రోండ్ల తిరుపతిరెడ్డి, నాయకులు కేవీఎన్ రెడ్డి, సత్తిరెడ్డి, మల్లారెడ్డి, పరశురాం, ఆరె కొమురయ్య, చందన్, సలీం, గుండ ముత్తయ్య, మామిడి సంజీవ్ పాల్గొన్నారు.
ముస్తాబాద్, మార్చి 10: కరీంనగర్ కదనభేరి బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామాల్లోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంపీపీ జనగామ శరత్రావు, పార్టీ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వివిధ గ్రామాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు.
ఇక్కడ మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తుల అంజ య్య , ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, జిల్లా కో అప్షన్ మాజీ స భ్యుడు సర్వర్పాషా, మాజీ సర్పంచ్ గాండ్ల సుమతీ, నాయకులు చెవుల మల్లేశ్ యాద వ్, రచమడుగు సంతోష్రావు, అన్వర్, నల్ల నర్సయ్య, గూడూరి భరత్, డబ్బేడ రాజు, ముక మల్లయ్య, మెంగని బాల్లక్ష్మి, శీలం స్వామి, ఎండీ నవాజ్, యాదగిరి, సుంచు సుధాకర్, పల్లె సత్యం రమేశ్, వెంకటేశ్, శ్రీనివాస్, గొండయ్య, జహింగీర్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట, మార్చి 10 కరీంనగర్ కదన భేరి సభను విజయవంతం చేయాలని ఏఎంసీ మాజీ చైర్మన్ అందె సుభాష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్లారెడ్డిపేటలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ఇక్కడ తెలంగాణ ఉద్యమ కారుడు దరువు ఎల్లన్న, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సుధాకర్రావు, సిరికొండ నాగరాజు ఉన్నారు.
సిరిసిల్ల రూరల్, మార్చి10: ఈనెల 12న కరీంనగర్లో జరిగే కధనభేరి బహిరంగ సభకు మండలంలోని నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఎంపీపీ మానస కోరారు. ఆదివారం మండల కేంద్రంలో బహిరంగ సభ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. ఇక్కడ పూ సపల్లి సరస్వతి, బీసీ సెల్ అధ్యక్షురాలు సంద్యరాణి, ఎస్సీ సెల్ అధ్యక్షురాలు సరోజ, రజిత, శాహేదబేగం, తార ఉన్నారు.