Putta Madhukar | రామగిరి, జూన్ 18 : రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు కెక్కర్ల సాయిబాబా ఇటీవల తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గురువారం బేగంపేటలోని సాయిబాబా నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా గీత కార్మికుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శంకేసి రవీందర్, బుర్ర శంకర్ గౌడ్, కుమార్ యాదవ్, కాపురబోయిన భాస్కర్, దామెర శ్రీనివాస్, శంకర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.