సైదాపూర్, జనవరి24: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త గాలన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆమెను, కుటుంబసభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం పరామర్శించారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వేంకటేశ్వర్లపల్లికి వెళ్లి గాలన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతికి గల కారణాలను తెలుసుకుని సంతాపం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్కుమార్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, తదితరులు ఉన్నారు.