గంభీరావుపేట, డిసెంబర్ 19: మాజీ మంత్రి పాటిరాజం ఆశయాలను కొనసాగిద్దామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో పాటిరాజం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి పాటిరాజం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహోన్నతనమైన వ్యక్తి పాటిరాజంను కోల్పోవడం దురదృష్టకరమని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, సర్పంచ్ కటకం శ్రీధర్, కొత్తపల్లి పీఏసీఎస్ చైర్మన్ భూపతి సురేందర్, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు పాపాగారి వెంకటస్వామిగౌడ్, వెంకటియాదవ్, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, లింగన్నగారి దయాకర్రావు, మల్యాల రాజవీర్, దోసల రాజు, వికాస్, ఎగదండి స్వామి, అభిలాష్, వెంకటరాజం, ప్రభాకర్, పాటిరాజం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.