కోనరావుపేట, నవంబర్ 3: కోనరావుపేట మండలం శివలింగంపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరింది. వేములవాడలోని చల్మెడ నివాసంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ, ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షాలను నెరవేర్చే పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు పొందిందన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు అన్నివర్గాలకు న్యాయం చేయాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని భావించి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలోపేతానికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు. అలాగే ధర్మారం సర్పంచ్ గున్నాల అరుణ బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కండువా కప్పి ఆహ్వానించారు.