పెద్దపల్లి టౌన్, జనవరి 5: బీజేపీ దళితజాతి వ్యతిరేక పార్టీ అని, ఎన్నికల కోసమే ఆ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మండిపడ్డారు. మాదిగ శక్తి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ నుంచి అయ్యప్ప ఆలయం మీదుగా బస్టాండ్ వరకు డప్పు మహిళా కళాకారులతో పెద్దఎత్తున ర్యాలీ తీశారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో పిడమర్తి రవి మాట్లాడారు.
బీజేపీ అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని, అధికారంలోకి రాగానే ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పినా నేటికి చేయలేదని మండిపడ్డారు. జనాభా దమాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీ నాయకులు పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ స్థానాల టికెట్లు మాదిగలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి పార్లమెంట్ టిక్కెట్ ఉద్యమ నాయకుడు గజ్జెల కాంతంకు ఇవ్వాలన్నారు. తెలంగాణలోని మాదిగ జాతి ఏకమై పార్టమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మొదలైన మాదిగ శక్తి ర్యాలీలు త్వరలోనే ఢీల్లీ, హైదరాబాద్, తదితర జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మాదిగ శక్తి రాష్ట్ర వ్యవస్థపక అధ్యక్షుడు బొంకూరి సురేందర్, మాదిగ రాజకీయ వేదిక రాష్ట్ర చైర్మన్ వక్కళ్ల సొమచంద్రశేఖర్, నాయకులు కల్లెపల్లి రవి, క్కు కనకరాజు, బొంకూరి నరేందర్, కుక్క నారాయణ, తాళ్లపల్లి అంజయ్య, నర్సయ్య, కుమ్మరి సందీఫ్, అజయ్, దూడ భూమయ్య, మాచర్ల బబ్లూ, సలిగంటి చిన్న, మంథని సత్యం, కమల, అశోక్, మంథని లక్ష్మణ్, నరేశ్, రాజు పాల్గొన్నారు.