కార్పొరేషన్, జనవరి 11: నగరంలో రోడ్లు, ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రెండో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. రోడ్లు, ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపునకు తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన పద్ధతులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రహదారులు, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేసే వారిపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు, నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్, డిజాస్టర్, రోడ్డు భవనాలు, విద్యుత్ శాఖ సిబ్బందితో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజూ రెండు బృందాలు నగరంలో రోడ్లు, ఫుట్పాత్ల ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రెండు బృందాలు వేర్వేరుగా డ్రైవ్ చేపట్టి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. తొలగించిన రూట్ వారీగా సరైన రిపోర్టు తయారు చేసి ఇవ్వాలన్నారు. ఏమైనా వస్తువులు స్వాధీనం చేసుకుంటే సంబంధిత వస్తువుల వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు.
వస్తువులకు సంబంధిత అధికారి పూర్తి బాధ్యత వహించాలన్నారు. నగరంలో స్ట్రీట్ వెండర్లు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేయకుండా చూడాలన్నారు. నగరపాలక సంస్థ నిర్మించిన చైతన్యపురి, ఇందిరానగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, బస్టాండ్ మారెట్ షెడ్లలోకి కూరగాయల వ్యాపారులను తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. 14.5 కిలోమీటర్ల ప్రధాన రోడ్లలో రెండు బృందాలు ఫీల్డ్ వర్ చేస్తూ ఆక్రమణలు తొలగించాలన్నారు. రోడ్లపై బండ్లు పెట్టి వ్యాపారం చేస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వ్యాపారులను కూడా తొలగించాలన్నారు. నగరంలో ఎకడా ట్రాఫిక్ సమస్య రాకుండ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రహదారులపై డీసీఎం, లారీ, ట్రకు లాంటి వాహనాలు నిలిచి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రాఫిక్ సీఐ తిరుమలేశ్, టౌన్ ప్లానింగ్ డీసీపీ సుభాశ్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.