మేడిపల్లి, ఏప్రిల్ 14: భీమారం మండలం దేశాయిపేట శివారులోని విఘ్నేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తూ ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. యజమాని సింగిరెడ్డి జనార్ధన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రైస్ మిల్లు నుంచి ఆదివారం తెల్లవారుజామున పొగలు వస్తున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చి చూడగా అప్పటికే మంటలు భారీగా చెలరేగాయి.
వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే 22 వేల క్వింటాళ్ల ధాన్యం, 20 వేల ఖాళీ గన్నీ సంచులు కాలిబూడిదైనట్లు చెప్పాడు. దాదాపుగా రూ.3 కోట్ల 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. జనార్ధన్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్యామ్రాజ్ తెలిపారు.