గంగాధర, డిసెంబర్ 1: ఏదేని కారణంతో మ రణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక భ రోసానిచ్చేందుకే కేసీఆర్ సర్కారు రైతుబీమా పథకానికి అంకురార్పణ చేసిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వడ్లూరి వెం కటమ్మ అనే మహిళా రైతు ఇటీవల మృతి చెందింది. గతంలో ఆమె రైతు బీమాకు దరకాఖా స్తు చేసుకోగా ఆమె కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం మంజూరైంది. కాగా గురువారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెంకటమ్మ ఇంటికి వెళ్లి కటుంబ స భ్యులకు రైతుబీమా ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పట్టాదారు పాస్తు పు స్తకం ఉన్న ప్రతి రైతు పేరు మీద ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించిందన్నారు. బీమా ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యేకు శంకరయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొండగట్టు ఆలయ డైరెక్టర్ పుల్కం నర్సయ్య, గంగాధర సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు వడ్లూరి అనిత, జోగు లక్ష్మీరాజం, ముక్కెర మల్లేశం, నాయకులు వడ్లూరి ఆదిమల్లు, వేముల అంజి, రేండ్ల శ్రీనివాస్, బొల్లాడి శ్రీనివాస్రెడ్డి, సముద్రాల అజయ్ తదితరులు పాల్గొన్నారు.