Vennampally | కాల్వశ్రీరాంపూర్, మార్చి 16 : వెన్నంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని వెలుతురు నిహారికకు ఆ గ్రామానికి చెందిన జిన్నా శ్రీనివాస్ రెడ్డి రూ.50 వేల నగదు ను సోమవారం ఆర్థిక సాంయంగా అందజేశారు. నిహారిక ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో పాల్గొనడానికి ఇండియా తరఫున సెలెక్ట్ అయింది.
ఈ సందర్భంగా మే నెల లో నేపాల్ లో జరగబోయే కాంపిటీషన్ కు అర్హత సాధించింది. అక్కడకు వెళ్లడానికి ఆర్థిక సహాయాన్ని జిన్న శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలవేన రమా రమేష్ , మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ వెలుతూరి రమేష్, ఏఎంసీ డైరెక్టర్ కలవేన రాజయ్య, నాయకులు తంగేళ్ల విజేందర్ రెడ్డి, బండి కవిత తిరుపతి, కాసారపు శ్రీలత శ్రీనివాస్, పులి జనార్ధన్, ఉడుత మౌనిక దేవేందర్, జంగం వంశీ, ఈర్ల శ్యామ్, మాజీ ఉపసర్పంచ్ చొప్పరి శ్రీనివాస్, కలవేన రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.