Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 7 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పంకెర్ల కుమారస్వామి కి ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేసింది. దీంతో 1990 -91 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని శివాలయం వద్ద కుమారస్వామిని ఆదివారం ఘనంగా సత్కరించారు.
ప్రజాసేవలో అనేక సమస్యలను పరిష్కరించి పేద ప్రజలకు అందుబాటు లో ఉండడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు సంపత్ రెడ్డి, శ్రీనివాస్, సభ్యులు అంజయ్య, సతీష్ రెడ్డి, సుదర్శన్, సమ్మయ్య, నగేష్ తిరుపతి, రవీందర్ సమ్మయ్య, తిరుపతి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.