Farmers | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 28 : పంటల మార్పిడీపై రైతులు దృష్టి సారించాలని సుల్తానాబాద్ ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నారాయణపూర్, కో దురుపాక, దేవునిపల్లి, చిన్నకల్వల, రెబ్బల్లేపల్లి, పెరిక పల్లి, మియాపూర్, చిన్నబొంకూర్ తదితర గ్రామాలలో మంగళవారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్విని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, సంఘం ఇన్చార్జి మహమ్మద్ ముఫాసిర్ అహ్మద్, అసిస్టెంట్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్లు దేవరనేని మోహన్ రావు, శ్రీగిరి శ్రీనివాస్, సీఈవోలు వల్లకొండ రమేష్, బూరుగు సంతోష్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, నాయకులు, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.