land survey | సారంగాపూర్, జూన్ 23 : గ్రామంలో చేపట్టే భూసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. బీర్పూర్ మండలంలోని కొమన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డొంకేశ్వరం గ్రామంలో భూభారతి భూ రీసర్వే చేపట్టడం కోసం మంగళవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత భూ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో గ్రామానికి చుట్టు హద్దులు ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతీ రైతుకు చెందిన భూమిని సర్వేయర్ల ద్వారా కొల్వనున్నామని, దీనికి రైతులందరూ సహకరించాలని కోరారు. గ్రామంలో ఏ రైతుకు చెందిన భూములు ఎప్పుడు కొలుస్తారో సమాచారం ఇస్తారని, అప్పుడు ఆ రైతులు అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాని అన్నారు.
రైతులకు ఏమైన సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్, తహసీల్దార్ సుజాత, డిప్యూటీ తహసీల్దార్ బొమ్మకంటి శ్రీనివాస్, సర్పంచ్ సీపతి స్వాతి, ఏడీడీఏ, సంబంధిత శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.